Tuesday, July 29, 2014

ఇదేం సవరణ..

వెనకటికి ఒకడు 'కాకరకాయ' అనరా అంటే.. 'కీకరకాయ' అన్నాడని నానుడి..తెలంగాణ రాజముద్ర వ్యవహారం అలాగే ఉంది..
తెలంగాణ రాజముద్రపై ఆది నుండి వివాదాలే..
రాజముద్రలో నాలుగు సింహాల కింద ఉండే 'సత్యమేవ జయతే' అనే దేవనాగరి లిపి అక్షరాల విషయంలో వ్యక్తమైన అభ్యంతరాలు న్యాయస్థానం మెట్లు దాటాయి.. దీంతో ప్రభుత్వం లోగో కింద ఉండే 'సత్యమేవ జయతే'ను రాజముద్ర కింది నుండి తీసి నాలుగు సింహాల కింద చేర్చింది.. ఇప్పడు వ్యవహారం అశ్వథామ హత: (కుంజర) అన్నట్లైంది.. గతంలో సత్యమే జయతే కొట్టొచ్చినట్లు కనిపించేది.. ఇప్పడు బూతద్దం పెట్టి చూసినా కొత్త రాజముద్రలో సత్యమేవజయతే కనిపించకుండా పోయింది..
పాత రాజముద్రలో కాకతీయ శిలాతోరణం అను ఫాంట్ క్లిప్ ఆర్ట్ నుండి సంగ్రహించారనే అపవాదు ఉండేది.. దాన్ని సవరించారు సంతోషం.. అలాగే మూడు మీనార్ల చార్మినార్ నాలుగు మీనార్లకు చేరింది..కానీ మిగతా అభ్యంతరాల సంగతి ఏమిటి? ఆ విషయాలను ఎందుకు పరిశీలించలేదు?..
తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపాలైన బతుకమ్మ, బోనం, పూర్ణకుంభంలతో ఏదైనా ఒకటి రాజముద్రలో చేరితే ఎంత హుందాగా ఉండేది.. నాకు తెలిసి సత్యమేవ జయతే వివాదం మళ్లీ కోర్డు దృష్టికి వెళుతుంది.. ఈలోగా ప్రభుత్వం ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజముద్రను సవరిస్తే బాగుంటుంది..

No comments:

Post a Comment