Monday, January 9, 2017

స్వామీజీ జీవితం అందరికీ ఆదర్శం

మనం మహనీయుల గొప్పదనాన్ని వివరించేందుకు వారిలోని విశిష్టతను చెప్పుకుంటాం.. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు చెబుతుంటాం.. ఏ మనిషైనా పుట్టుకతో గొప్పవ్యక్తి కాలేడు.. తన జీవితాన్ని తీర్చి దిద్దుకోవడం ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన వారినే మహనీయుడని లోకం కొనియాడుతుంది..
భారత దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద.. యువతకు స్పూర్తి ప్రధాత.. స్వామీజీ చిన్నప్పడు చదువులో అత్తెసరు మార్కులతో పాసయ్యారనే వార్తలు అన్ని పత్రికలూ ప్రచురించాయి.. ఒకటిన్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఒక ఆధ్యాత్మిక నాయకుని చదువు గురుంచి ఒకాయన పరిశోధించాడని ఆ వార్త బోగట్టా.. అది వాస్తవం కావచ్చు..
ప్రముఖుల జీవితాల గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వీటి గురుంచి పరిశోధించి రాసే వారినీ తప్పు పట్టలేం.. కానీ రామాయణంలో పిడకల వేట మాదిరిగా వివేకానందుని విద్యార్హతలను బయట పెట్టడం ద్వారా సదరు రచయిత ఏమి చెప్పదలచుకున్నాడే విషయంలో స్పష్టత లేదు..
వివేకానంద అసలు పేరు నరేంద్ర దత్తుడు.. చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక చింతనతో దైవాన్వేషణ సాగించినట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతోంది.. ఇందు కోసం ఆయన ఎన్నో పుస్తకాలను చదివారు.. రామకృష్ణ పరమహంసతో సహా ఎందరో మహాపురుషులను కలిశారు.. సమాజ సేవకు ఆధ్యాత్మిక చింతన కారణం వల్ల స్వామీజీ తరగతి గదులకు సంబంధించిన పాఠాలపై పెద్దగా ధ్యాస పెట్టలేదు..

స్వామి వివేకానంద జీవితం రహస్యం ఏమీ కాదు.. షికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో హిందూ మత విశిష్టతను, భారత దేశ సంస్కృతిక, ఆధ్మాత్మిక వైభవాన్ని చాటి చెప్పారు.. స్వామీజీ జీవించింది చాలా కొద్ది కాలమే.. కానీ వారి స్పూర్తి మాత్రం తరతరాల వారినీ ఆకర్శిస్తుంటుంది.. వివేకానందుని బోధనలు ఈనాటికీ అందరినీ ఆకర్శిస్తున్నాయి.. స్వామీజీ గొప్పదనం గురుంచి చెప్పేందుకు ఇంతకన్నా ఎక్కువ మాటలు అవసరం లేదు..

No comments:

Post a Comment