Sunday, January 15, 2017

దేశ ఔన్నత్యం జవాను చేతిలోనే..

కొద్ది వారాల క్రితం సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టిస్తున్న పాకిస్థాన్ భూభాగంపై మన వీర జవాన్లు ఆకస్మిక దాడులు చేయడం దేశ ప్రజల్లో భావోద్వేగాలను నింపడంతో పాటు ఎంతో ఆనందాన్ని కలిగించింది.. ఆ సమయంలో ఒక జవాను పాకిస్థాన్ ను హెచ్చరిస్తూ చేసిన చేసిన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది.. దేశ ప్రజల ప్రశంసలను అందుకుంది..
ఇటీవల సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న మరో జవాను తమకు అధికారులు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో కూడా అంతే సంచలనం సృష్టించింది.. దీనిని సైన్యం కూడా తీవ్రంగానే పరిగణించింది.. ఇక మీదట ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..
ఇక్కడ మొదటి జవాను మన సైన్యం సత్తాను చాటి దేశ ప్రతిష్టను పెంచాడు.. రెండో సైనికుడు సాధారణ సమస్యను భూతద్దంలో చూపించి దేశ ప్రతిష్టను దిగజార్చాడు..
సైన్యం అంటే ప్రజలకు, ముఖ్యంగా భారత దేశంలో విపరీతమైన అభిమానం ఉంటుంది.. క్లిష్టమైన వాతావరణంలో రాత్రింబవళ్లు దేశ సరిహద్దులను కాపాడే సైనికులు అంటే గౌరవం, ఆరాధనా భావం భారతీయులకు కాస్త ఎక్కువే.. సైనికులను హీరోలుగా చూస్తాం.. ప్రాణాలకు తెగించి తీవ్రవాదులు, శత్రువులతో పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు ఎంతో ఉద్వేగంతో జేజేలు పలుకుతాం..

భారతీయ సమాజంలో సైనికునికి ఎంతో గౌరవం ఉంది.. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే ప్రభుత్వం సైనికుల ప్రయోజనాలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తుంది.. ఎన్నో రకాల రాయితీలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. ఇవన్నీ దేశ ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నుల ద్వారానే..
ప్రజులు తమకు ఇస్తున్న గౌరవాన్ని, చూపిస్తున్న అభిమానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత సైనికులపై కూడా ఉంది.. సమస్యలు అనేవి అంతటా ఉంటాయి.. సైన్యం కూడా దీనికి అతీతం కాదు.. వీటిని పరిష్కరించుకునేందుకు మార్గాలు ఎన్నో ఉన్నాయి.. సోషల్ మీడియా ద్వారా అతిగా చూపించడం ద్వారా ప్రజల దృష్టిలో చులకన కావడం, క్రమశిక్షణా చర్యలకు గురి కావడం తప్ప సాధించేది ఏమీ ఉండదు..

జవానులు ప్రజల దృష్టిలో ఎప్పటికీ హీరోలుగానే ఉండాలి.. జీరోలుగా మారి చులకన కావద్దు..

No comments:

Post a Comment