Friday, June 30, 2017

మహోన్నత వ్యక్తి హరిహర శర్మ

ప్రముఖ విద్యావేత్త, సమాజిక కార్యకర్త హరిహర శర్మ గారు ఇక లేరనే వార్త వ్యక్తిగతంగా దిగ్భ్రంతిని కలిగించింది.. ఎంతో మంది జాతీయవాదులకు, యువతకు, విద్యార్థులకు స్పూర్తి ప్రధాతగా, మార్గదర్శిగా నిలిచిన శర్మ గారు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న మహావ్యక్తి. విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో వారితో అనుబంధం కొనసాగింది. విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు, సమాచార భారతికి సుదీర్ఘ కాలం అధ్యక్షులుగా హరిహర శర్మగారు సేవలందించారు, జాగృతి ప్రకాశన్ ట్రస్టుకు గతంలో అధ్యక్షులుగా, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. అధ్యాపక వృత్తిలో విజయనగర్ కామర్ కాలేజీ ప్రిన్సిఫల్ గా పదవీ విరమణ చేశారు, రచనా జర్మలిజం కళాశాల వ్యవస్థాపకుల్లో శర్మగారు కీలకపాత్ర పోశించారు. కేశవ మెమోరియల్ విద్యాసంస్థకు ప్రస్తుతం వారు కార్యదర్శి. హరిహర శర్మ గారి నేతృత్వంతో పని చేయడం, వారితో అనుబంధం నా అదృష్టంగా భావిస్తున్నారు. వారు మన మధ్య లేకున్నా వారి స్పూర్తి నిరంతరం మనందరిలో కొనసాగుతుంది.. ఓం శాంతి

No comments:

Post a Comment