కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లోక్ సభ సీట్లను కట్టబెట్టిన ఆంధ్ర
ప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏపాటి విలువ ఇస్తోందో మరోసారి గమనించండి..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దర్శనం
కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఎదురు చూశారు.. ఆమె అపాయింట్మెంటే దొరకలేదట పాపం.. చేసేది
లేక సెకండ్ కేడర్ నాయకులతో చర్చలు జరిపి హైదరాబాద్ కు తిరుగు ముఖం పట్టారు.. రెండు
రోజుల కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సోనియాజీ, మూడో రోజున ముఖ్యమైన అపాయింట్మెంట్లతో
బిజీగా ఉన్నారట.. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆమె సమయం ఇవ్వలేదంటే
అంత పెద్ద రాచకార్యాలు ఏమున్నాయో? తమ రాష్ట్రాల్లోనే గుర్తింపు కోల్పోయిన
గులాంనబీ, దిగ్విజయ్ లాంటి నాయకులతో కలిసేందుకే కిరణ్ కుమార్ గారు ఢిల్లీ దాకా
వెళ్లారు.. ఏం వారినే హైదరాబాద్ వచ్చి మాట్లాడమని చెప్పొచ్చు కదా? చూశారు కదా
తెలుగు వారన్నా, ఏపీ కాంగ్రెస్ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏ మేరకు
గౌరవం ఉందో..

ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లింది ఉత్తరాంచల్ రాష్ట్ర వరదల్లో చిక్కుకున్న
తెలుగువారిని ఓదార్చి, వారికి అందుతున్న సహాయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికే
కాబోలు అని అంతా భావించారు.. కానీ కిరణ్ కుమార్ గారు పుణ్యం పురుషార్ధం కలిసి
వస్తాయని అన్ని పనులు కలుపుకొని అక్కడికి వెళ్లారు.. సరే ఇక ఏపీ భవన్లోనే బస
కాబట్టి బాధితుల కష్టాలు వినక తప్పలేదు.. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు
ఉత్తరాఖండ్ వెళ్లి తమ ప్రజల బాగోగులు చూసుకున్నారు.. మన సీఎం గారికి మాత్రం అంత
తీరుబడి లేదేమో? అందుకే క్రెడిట్ అంతా తన జిల్లాకే చెందిన ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబుకు ఇచ్చేశారు..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దర్శనం
కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఎదురు చూశారు.. ఆమె అపాయింట్మెంటే దొరకలేదట పాపం.. చేసేది
లేక సెకండ్ కేడర్ నాయకులతో చర్చలు జరిపి హైదరాబాద్ కు తిరుగు ముఖం పట్టారు.. రెండు
రోజుల కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సోనియాజీ, మూడో రోజున ముఖ్యమైన అపాయింట్మెంట్లతో
బిజీగా ఉన్నారట.. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆమె సమయం ఇవ్వలేదంటే
అంత పెద్ద రాచకార్యాలు ఏమున్నాయో? తమ రాష్ట్రాల్లోనే గుర్తింపు కోల్పోయిన
గులాంనబీ, దిగ్విజయ్ లాంటి నాయకులతో కలిసేందుకే కిరణ్ కుమార్ గారు ఢిల్లీ దాకా
వెళ్లారు.. ఏం వారినే హైదరాబాద్ వచ్చి మాట్లాడమని చెప్పొచ్చు కదా? చూశారు కదా
తెలుగు వారన్నా, ఏపీ కాంగ్రెస్ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏ మేరకు
గౌరవం ఉందో..
ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లింది ఉత్తరాంచల్ రాష్ట్ర వరదల్లో చిక్కుకున్న
తెలుగువారిని ఓదార్చి, వారికి అందుతున్న సహాయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికే
కాబోలు అని అంతా భావించారు.. కానీ కిరణ్ కుమార్ గారు పుణ్యం పురుషార్ధం కలిసి
వస్తాయని అన్ని పనులు కలుపుకొని అక్కడికి వెళ్లారు.. సరే ఇక ఏపీ భవన్లోనే బస
కాబట్టి బాధితుల కష్టాలు వినక తప్పలేదు.. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు
ఉత్తరాఖండ్ వెళ్లి తమ ప్రజల బాగోగులు చూసుకున్నారు.. మన సీఎం గారికి మాత్రం అంత
తీరుబడి లేదేమో? అందుకే క్రెడిట్ అంతా తన జిల్లాకే చెందిన ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబుకు ఇచ్చేశారు..
No comments:
Post a Comment