Friday, January 13, 2017

జీవహింసకు మతాన్ని బట్టి ఉంటుందా?

నాదో అమాయకపు ప్రశ్న.. జీవహింస పేరుతో సంక్రాంతి సందర్భంగా జరిగే సాంప్రదాయ జల్లికట్టు, కోడి పందేలపై నిషే్ధం విధిస్తున్నారు.. సంతోషం.. కానీ సంవత్సరమంతా కోళ్లు, మేకలు, పశువులను కోసుకు తినవచ్చా?.. అది జీవహింస పరిధిలోకి రాదా?.. ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, జీవకారుణ్య సంస్థలు మెజారిటీ ప్రజలు జరుపుకునే పండుగలు, సాంప్రదాయాలపై మాత్రమే ఎందుకు కన్నేస్తాయి.. ఇతరులు జరుపునే పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున జీవాలను కోస్తుంటే ఎందుకు పట్టించుకోరు?.. కానీ బోనాలు, మేడారం తదితర పండుగలు, జాతరల్లో బలులు మాత్రం వద్దంటారు?.. జీవహింస ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా ఒకే న్యాయం ఎందుకు వర్తించదు?.. ఎందుకు ఈ వివక్ష?.. ఇదేనా న్యాయం?

భోగి పండుగ మీ ఇంట భోగ భాగ్యాలు తేవాలని కోరుకుంటున్నాను..


Thursday, January 12, 2017

యువతకు ఆశాజ్యోతి.. వివేకానంద

ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ తానిచ్చిన భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. ‘లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..’ అంటూ యువతకు కర్తవ్యాన్ని సూచించారు.. ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అని చెప్పారు.. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత’ ఈ దేశానికి కావాలన్నారు.. ‘దరిద్రుల సేవే నారాయణ సేవ’ అని ఉద్బోధించారు.. ‘నా దేశంలో కుక్క సైతం ఆకలితో చావద్దు’ అని సూచించారు..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి ఆయన చక్కని బోధనలు చేశారు.. అవి చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు..
స్వామి వివేకానంద జయంతి నేడు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీజీ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

Monday, January 9, 2017

స్వామీజీ జీవితం అందరికీ ఆదర్శం

మనం మహనీయుల గొప్పదనాన్ని వివరించేందుకు వారిలోని విశిష్టతను చెప్పుకుంటాం.. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు చెబుతుంటాం.. ఏ మనిషైనా పుట్టుకతో గొప్పవ్యక్తి కాలేడు.. తన జీవితాన్ని తీర్చి దిద్దుకోవడం ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన వారినే మహనీయుడని లోకం కొనియాడుతుంది..
భారత దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద.. యువతకు స్పూర్తి ప్రధాత.. స్వామీజీ చిన్నప్పడు చదువులో అత్తెసరు మార్కులతో పాసయ్యారనే వార్తలు అన్ని పత్రికలూ ప్రచురించాయి.. ఒకటిన్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఒక ఆధ్యాత్మిక నాయకుని చదువు గురుంచి ఒకాయన పరిశోధించాడని ఆ వార్త బోగట్టా.. అది వాస్తవం కావచ్చు..
ప్రముఖుల జీవితాల గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వీటి గురుంచి పరిశోధించి రాసే వారినీ తప్పు పట్టలేం.. కానీ రామాయణంలో పిడకల వేట మాదిరిగా వివేకానందుని విద్యార్హతలను బయట పెట్టడం ద్వారా సదరు రచయిత ఏమి చెప్పదలచుకున్నాడే విషయంలో స్పష్టత లేదు..
వివేకానంద అసలు పేరు నరేంద్ర దత్తుడు.. చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక చింతనతో దైవాన్వేషణ సాగించినట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతోంది.. ఇందు కోసం ఆయన ఎన్నో పుస్తకాలను చదివారు.. రామకృష్ణ పరమహంసతో సహా ఎందరో మహాపురుషులను కలిశారు.. సమాజ సేవకు ఆధ్యాత్మిక చింతన కారణం వల్ల స్వామీజీ తరగతి గదులకు సంబంధించిన పాఠాలపై పెద్దగా ధ్యాస పెట్టలేదు..

స్వామి వివేకానంద జీవితం రహస్యం ఏమీ కాదు.. షికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో హిందూ మత విశిష్టతను, భారత దేశ సంస్కృతిక, ఆధ్మాత్మిక వైభవాన్ని చాటి చెప్పారు.. స్వామీజీ జీవించింది చాలా కొద్ది కాలమే.. కానీ వారి స్పూర్తి మాత్రం తరతరాల వారినీ ఆకర్శిస్తుంటుంది.. వివేకానందుని బోధనలు ఈనాటికీ అందరినీ ఆకర్శిస్తున్నాయి.. స్వామీజీ గొప్పదనం గురుంచి చెప్పేందుకు ఇంతకన్నా ఎక్కువ మాటలు అవసరం లేదు..

Saturday, January 7, 2017

పాపం జియో


జియో వాడు సర్వీసులు మొదలైన కొత్తలో సిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఐడీ కార్డులో నా కళ్లు కనిపించడం లేదని తిరస్కరించాడు.. (ఇంకా నయం బాగా వళ్లు చేశావనలేదు).. తర్వాత ిఇచ్చి చచ్చాడునుకోండి..
ఇప్పుడు చూడండి.. సిమ్ములు బాబూ సిమ్ములంటూ రోడ్డు పక్కన ముష్టోళ్లు, కుష్టోళ్లతో కలిసి కస్టమర్ల కోసం ఎలా అడుక్కుంటున్నాడో.. పాపం..

Tuesday, January 3, 2017

నరేంద్ర మోదీ.. ఆలోవాలా..

ఇదేమిటి మ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆటో న‌డుపుతున్నారేమిటి అనుకుంటున్నారా?
పేరు షేక్ అయూబ్ (49), ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం బొక్క‌ల‌గూడ కాల‌నీవాసి.. గ‌తంలో ఆర్టీసీలో డ్రైవ‌ర్‌.. ప్ర‌స్తుతం ఆటో న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నారు.. అచ్చం న‌రేంద్ర మోదీలా ఉన్న ఈయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నం మోదీ, మోదీ అంటున్నారు..దీనికి ఆయూబ్ ఎంతో సంతోషిస్తున్నారు.. అన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చేప‌ట్టిన న‌ల్ల‌ధ‌నంపై పోరాటానికి బాస‌ట ప‌లుకుతున్నారు మ‌న ఆయూబ్ భాయ్‌.. స‌మాన్యుల‌కు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, దేశానికి మంచి రోజులు వ‌స్తాయి అంటున్నారు..

అర్థరాత్రి.. ఒక ఏటీఎం.. ఒక బిచ్చగాడు

_31 డిసెంబర్, రాత్రి 11.15 గం. కింగ్ కోఠి ప్యాలస్ ఎదురుగా.._
రద్దీ తక్కువగా ఉన్న ఏటీఎం కనిపించింది.. భాగ్యనగరంలో ఏమి నా భాగ్యం అనుకుంటూ క్యాష్ డ్రా చేశాను.
బయట అరుగుపై ఒక బిచ్చగాడు కనిపించాడు..
నేను ఏమైనా ఇస్తాననుకొని చేయి చాచాడు..
జేబులు తడుముకొని _'చిల్లర్ నహీ హై'_ అన్నాను..
అతను నా వైపు అదో రకంగా చూసి _'పర్వా నహీ సాబ్ కిత్నా చేంజ్ హోనా?'_ అంటూ తన జోలె నుండి నోట్లు తీశాడు..
అవాక్కవ్వడం నా వంతయింది.