Saturday, March 16, 2013

విఫల విదేశాంగ విధానం

జనాభా రీత్యా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మన దేశం.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉంది మన దేశానికి.. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు తమదైన ముద్రను వేస్తున్నారు.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లుతున్నారు.. మన సంస్కృతీ సాంప్రదాయాల కారణంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకుంటున్నాం.. కానీ..
దురదృష్టవశాత్తు విదేశాంగ విధానంలో భారత దేశం రాను రానూ అంతర్జాతీయంగా చులకనైపోతోంది.. ఇతర దేశాలు మనను చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.. భారతీయ మత్స్యకారులను చంపిన తమ నావికులకు అప్పగించేది లేదని ఇటలీ తేల్చి చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితే ఇందుకు నిదర్శనం.. సముద్రంలో భారతీయ జలాల్లో మన దేశ పౌరులను చంపడమే తప్పయితే, వారు సోమాలియా సముద్ర దొంగలుగా పొరబడ్డామని.. అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగిన సంఘటనకు తమను శిక్షించే అధికారం భారత దేశానికి లేదని దబాయించడం ఇటలీకే చెల్లింది.. తమ దేశంలో ఎన్నికలు ఉన్నాయని, ఓటు వేసేందుకు తమ పౌరులకు బెయిల్ ఇవ్వాలని కోరి విడిపించుకున్న ఇటలీ ప్రభుత్వం, ఇప్పడు వారిని అప్పగించేది లేదు పొమ్మనడం చేయడం స్పష్టంగా కండకావరమే..
నిజానికి ఇటలీని గుడ్డిగా నమ్మి ఆ దేశ నావికులకు బెయిల్ ఇవ్వడం మన అమాయకత్వమే.. ఈ విషయంలో మనం ఉదారంగా ఉన్నా, ఆ దేశం అవమానకరంగా వ్యవహరించడం ద్వారా భారత దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇటలీపై ఎన్ని రకాలుగా హుంకరించినా ఫలితం ఏముంటుంది?.. దౌత్య విధానంలో భారత దేశ వైఫల్యానికి ఈ సంఘటన ఉదాహరణ మాత్రమే.. నిజానికి ఈ రకమైన వైఫల్యం మన దేశానికి తొలిసారి కానేకాదు.. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుండీ మనం ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాం..
కాశ్మీర్ కుంపటి ఈనాటికి రగలడానికి కారణం ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 1947లో భారత దేశంలో విలీనం అవుతున్న కాశ్మీర్ పై పాకిస్తాన్ సైన్యం దొంగదాడి చేస్తే మన సైన్యాలు విజయవంతంగా తిప్పి కొట్టాయి.. కానీ నెహ్రూజీ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి అంతర్జాతీయం చేశారు.. సగం కశ్మీర్ ఇంకా పాక్ చేతిలోనే ఉంది.. ఆ దేశం కాశ్మీర్ సమస్యకు నిత్యం ఆజ్యం పోస్తూనే ఉంది.. మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాల వెనుక పాక్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఇంకా ఆ దేశంతో స్నేహ సంబంధాలు ఆశించడం వెర్రిబాగుల తనమే.. అలాగే హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ నెహ్రూ గుడ్డిగా చైనాను నమ్మేశారు.. ఆయన స్నేహ హస్తాన్ని వమ్ము చేస్తూ చైనా 1962లో భారత దేశంపై యుద్దానికి దిగింది.. కాశ్మీర్లోని అక్సాయి చిన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ తమవేనంటూ చైనా దబాయిస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం..
నెహ్రూ తదనంతరం కూడా మన దౌత్య వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పాకిస్తాన్ కబంద హస్తాల నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా నిలిచేందుకు బంగ్లాదేశ్ కు మన ఎంతో సాయం చేశాం.. కానీ ఈ విషయంలో మనకు రుణ పడాల్సిన బంగ్లాదేశ్ నేతలు అందుకు విరుద్దంగా మన దేశంలో తీవ్రవాద శక్తులకు ఊతం ఇస్తూనే ఉన్నారు..
భారత దేశానికి విశ్వాసపాత్ర మిత్రునిగా ఉండాల్సిన శ్రీలంక కూడా క్రమంగా చైనా విష కౌగిలిలోకి జారుకుంటోంది.. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది మన దేశ పరిస్థితి.. తమిళుల సమస్య మనకు కొరగాని కొయ్యగా మారిపోయింది.. తమిళనాడు రాజకీయ పార్టీల వత్తిడి కారణంగా లంక ప్రభుత్వంతో మన దేశ సంబంధాలు డోలాయామంలో పడ్డాయి..
భారత దేశం నుండి ఎంతో లబ్ది పొందిన ద్వీప రాజ్యం మాల్దీవ్స్ సైతం తోక జాడించేసింది.. అక్కడి తిరుగుబాటు దారులు భారత అనుకూల అధ్యక్షున్ని గద్దె దించారు.. చైనాతో సంబంధాలు పెంచుకున్నారు.. జీఎంఆర్ కాంట్రాక్ట్ రద్దు చేయడం ద్వారా భారత దేశానికే సవాలు విసిరింది మాల్దీవ్స్ ..
సాంస్కృతికంగా భారత దేశంతో పురాతన కాలం నుండి సంబంధాలు ఉన్న నేపాల్ సైతం చైనా ఉచ్చులో పడింది.. చైనా చాలా తెలివిగా మన దేశాన్ని చుట్టు ముడుతోంది.. హిందూ మహా సముద్రంలో స్థావరాలు నెలకొల్పినా చేష్టలుడిగిపోతున్నాం.. చైనా భయంతో బర్మాలో ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతు ఇవ్వలేక, సైనిక పాలకులను సమర్ధించలేక మన దేశం సతమతం అవుతోంది..
ప్రచ్చన్న యుద్ద కాలంలో భారత దేశం అలీనోద్యమాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని కొనసాగించకుండా కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ తో దోస్తీ కట్టింది.. ఫలితంగా పెట్టుబడి దారీ అమెరికా మనపై శీత కన్నేసింది.. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అనివార్యంగా అమెరికా-ఇండియాలు సంబంధాలు ఏర్పరచుకున్నాయి.. ఇందుకు మార్కెట్ అవసరాలే కారణమని చెప్పక తప్పదు.. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానల పేరిట మన విదేశాంగ నీతిని దారి మరలిస్తున్నాం..


ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో ఉండాల్సిన మన దేశం ఇతర దేశాల దృష్టిలో చులకనైపోవడం భారతీయులందరికీ అవమానకరం.. దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఇండియాను పొరుగు దేశాలే ఖాతరు చేయనప్పడు.. ఇటలీ, అమెరికా, చైనాలు గౌరవిస్తాయని భావించడం అత్యాశే అవుతుంది.. చివరగా ఈ పరిస్థితికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కటువుగానే చెప్పక తప్పదు.. మన దేశానికి సమర్ధ నాయత్వం లోపించింది.. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే నాయకత్వమే లేదు.. ఇప్పడు మన దేశం సమర్థ నాయకుని కోసం ఎదురు చూస్తోంది.. ఈ విషయంలో మనం రాజకీయాలు పక్కన పెట్టి సీరియస్ గా అలోచించాల్సిన సమయం వచ్చింది.. 

Tuesday, March 12, 2013

యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలుసో లేదో..

Saturday, March 9, 2013


మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. త్రిమూర్తుల్లో ఒకరు, లయకారుడై పరమ శివుడు ఈ రోజే జన్మించాడని శివ పురాణం చెబుతోంది.. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం. శివరాత్రి రోజున తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉంటారు.. రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, మన రాష్ట్రంలోని పంచారామాలు, శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు..
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు..

హట్సాప్ దివాన్ సాబ్..

 పాకిస్తాన్ ప్రధానమంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ కు పరాభవం ఎదురైంది.. ఆజ్మీర్ లోని ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు పాక్ ప్రధాని.. దర్గా దివాన్ జైనుల్ అబేదిన్ అలీఖాన్ అష్రాఫ్ రాకను వ్యతిరేకించారు.. ఇటీవల సరిహద్దులో భారత జవాన్ల తలలు నరికిన పాకిస్తాన్ కనీసం క్షమాపణ అయినా చెప్పనందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.. మతం కన్నా దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన అలీఖాన్ సాబ్ కు నిజంగా దేశ ప్రజలు జేజేలు చెప్పాలి..

ఒకవైపు దర్గా దివాన్ పాకిస్తాన్ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే, ఘనత వహించిన మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి గౌరవార్ధం విందు కూడా ఇచ్చారు.. సరే అతిధి దేవో భవ అని విందు ఇచ్చారనే అనుకుందాం.. పనిలో పనిగా నిరసన తెలిపితే ఎంత హుందాగా ఉండేది..

Friday, March 8, 2013

మహిళల పార్టీ రావాలి

చెట్టు ముందా, విత్తు ముందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. అలాగే ప్రకృతిలో స్త్రీ, పురుషుల్లో ఎవరు అధికం అని ప్రశ్నించడం అవివేకమే.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కానే కాదు.. బండికి రెండు ఇరుసుల్లా ఇద్దరూ సమానమే.. దురదృష్ట వశాత్తు ప్రపంచం ఇంత వేగంగా దూసుకెళుతున్నా, మానవుని మేథస్సు కొత్త పుంతలు తొక్కి కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నా పురుష పుంగవుల దృష్టికోణం మారలేదు.. ఆధిక్యత అనేది పోటీలో ఉండాలి.. కానీ లైంగిక కోణంలో ఆధిక్యతను ప్రదర్శించడం వల్లే సమస్యలు వస్తున్నాయి..
ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు.. నిజానికి మంచి పద్దతి కాదని నా అభిప్రాయం.. ఏం మహిళలను ఈ ఒక్కరోజే గౌరవించాలా? ప్రతి రోజూ గౌరవించాల్సిందే.. ఒక తల్లిగా, సోదరిగా, జీవిత భాగస్వామిగా, స్నేహితురాలిగా వారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించాలని కోరుకుందాం..
మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వివక్షత అన్ని విషయాల్లోనూ కొనసాగుతోంది.. అత్యాచారాల వార్తలు లేని దిన పత్రికను చూడటమే అరుదైపోయింది.. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.. ఢిల్లీలో జరిగన అమానవీయ సంఘటనలు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.. రేపిస్టులకు కఠిన శిక్షల విషయంలో రాజీ ధోరణి దురదృష్టకరం..
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు.. చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేక్షషన్ల విషయంలో జరుగుతున్న నాటకాలు చూస్తుంటే మన రాజకీయ పార్టీల ముసుగులు స్ఫష్టంగా బయటపడుతున్నాయి.. అసలు రిజర్వేషన్లు అవసరమా?
మన దేశంలో కులానికి, వర్గానికి, మతానికి, భాషకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి.. మరి మహిళలే పార్టీ తమ కోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు.. పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారితే రిజర్వేషన్ల కోసం దేబిరించాల్సిన అవసరం ఏమిటి.. వారే పాలకులుగా ఆవిర్భవించొచ్చు కదా? అధికారం చేతిలో ఉంటే చట్టాలను ఉపయోగించి తోక జాడించే పురుష పుంగవులను దారిలో పెట్టొచ్చు.. ఈ దిశగా మనం ఎందుకు ఆలోచించడం లేదు?..

Thursday, March 7, 2013

చీకటి రాజ్యం


ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేనంతగా విద్యుత్ సంక్షోభంలో పడింది.. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు.. పరీక్షల వేళ కరెంటు కోతలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి.. మా రోజుల్లో కిరోసిన్ దీపాలు, వీధి లైట్ల కింద చదువుకునేవారం అని పెద్దలు చెప్పుకోవడాన్ని నమ్మలేక పోయిన పిల్లలకు ఇప్పడు అసలు విషయం తెలిసొచ్చింది పాపం..
పట్టణాలకన్నా గ్రామాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. మోటార్లకు కరెంటు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి.. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఇంకెంత గడ్డుగా ఉంటాయో, ఊహించడానికే భయంగా ఉంది..
కరెంటు కోతలతో ఇప్పటికే పారిశ్రామిక రంగం దివాలా తీసే స్థితికి చేరించి.. హైదరాబాద్ శివార్లలో చిన్న తరహా పరిశ్రలు ఎన్నో మూత పడ్డాయి.. కొన్ని వేల మంది ఉపాధికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.. ఉత్పాదన, ఉపాధి అవకాశాలే దెబ్బతిన్నప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుంది?..
ప్రాజెక్టుల్లో నీరే లేనప్పడు జల ఉత్పత్తి ఎలా చేస్తారు? గ్యాసే లేనప్పడు గ్యాస్ ఆధారిత ఉత్పత్తి అసాధ్యంగా మారింది.. భారమంతా థర్మల్ విద్యత్తు పైనే పడింది.. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ముందు చూపులేని చేతగాని ప్రభుత్వమే.. విద్యుత్తు ఛార్జీలు అడ్డగోలుగా పెంచేసి ప్రజలను దోచుకోవడంలో చూపే శ్రద్ధలో పదో వంతైనా విద్యుత్తు రంగ సంక్షోభం నుండి గట్టెక్కడం పై పెట్టి ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవా?


ముఖ్యమంత్రి సైతం విద్యుత్తు సంక్షోభాన్ని అంగీకరిస్తూ చేతులెత్తేసినప్పుడు ఇక ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు? ఆంధ్ర ప్రదేశ్ కాస్తా అంధేరాప్రదేశ్ గా మారిపోయింది..

Tuesday, March 5, 2013

ఇంకా అర్హత రాలేదు పాపం..


రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదంట.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అభ్యర్థి అనే ప్రచారానికి స్వయంగా తెరదించుకున్నారు.. అవునులే చేతిలో రిమోట్ (అధికారం) ఉన్నాక ప్రధాని పెదవి ఎందుకు? నరేంద్ర మోడి అన్నట్లు ప్రధాని పదవి అంటే వారి దృష్టిలో అది రాత్రి కాపలారునికి పని.. మంచొ జరిగితే క్రెడిట్ మనకు, చెడు జరిగితే ఆ పదవిలో ఉన్నాయనే బలి.. వాట్ ఎన్ ఐడియా రాహుల్ జీ.. పాపం మన కాపలాదారుడిని పాపాలను భరించే రాత్రి ఇంత సుదీర్ఘ కాలం ఉంటుందని తెలియదు పాపం..
సో చివరగా చెప్పొచ్చే దేమిటంటే రాహుల్ జీకి ప్రధాని పదవిపై ఆశ లేదు.. అన్నారంటే తనకు దేశానికి పాలించే అర్హత లేదనో లేక శక్తి లేదనో స్వయంగా ఒప్పేసుకున్నారు.. మరెందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం?